ENGLISH | TELUGU  
Home  » TV News

మళ్ళీ చెప్తున్నా...ఆ వీడియోస్ పెట్టి నా హార్ట్ బ్రేక్ చేయొద్దు

on Sep 20, 2023

దేశవ్యాప్తంగా గణేష్‌ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్న తరుణంలో ప్రముఖ యాంకర్‌ రష్మీ  వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో  షేర్‌ చేసి తీవ్రంగా విమర్శించింది.  ఐతే ఇందులో కొంతమంది  భక్తులు ఏనుగును టార్చర్‌ చేస్తూ విన్యాసాలు చేయించారు.

అసలే యానిమల్‌ లవర్‌ అయిన యాంకర్‌ రష్మీకి కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది.  ఈ వీడియోపై స్పందిస్తూ మూగజీవాలను ఇలా ఇబ్బంది పెట్టవద్దంటూ కోరింది. ‘ఇది చాలా బాధాకరం. ఊరేగింపుల్లో జంతువులను అసలు తీసుకురాకూడదు. ఏనుగు చెవులను బుల్‌ హక్‌తో పొడిచి టార్చర్‌ చేస్తూ.. ఇలా విన్యాసాలు చేయిస్తున్నారు. హిందువులు,  సనాతన ధర్మాన్ని అనుసరించే వారు పండగలు, పర్వదినాల్లో ఇలా మూగజీవాలకు హాని జరగకుండా చూసుకోవాలి ఇది పాత వీడియోనే ఐనా సరే మీ అందరికీ మళ్ళీ చెబుతున్నా.  

ఈ పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది రష్మీకి అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే కొంతమంది  ఎప్పటిలాగే నెగెటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు.  ఎక్కడ ఏ మూగజీవికి సమస్య వచ్చినా తన ప్రేమను చాటుకుంటుంది రష్మీ.  కరోనా సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టింది. యానిమల్ లవర్ గా రష్మీ షేర్‌ చేసే పోస్టులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో  మిస్‌ ఫైర్‌ అవుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పిల్లలపై కుక్కల దాడి విషయంలో విమర్శలు ఎదుర్కొంది రష్మీ. అలాగే బక్రీద్‌  సందర్భంలో ఆమె చేసిన ట్వీట్‌పై కూడా ట్విట్టర్ లో మాటల యుద్ధమే ఎదుర్కొంది. ఇక కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై కూడా కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచింది.  స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరపై హవా సాగిస్తోన్న రష్మీ అప్పుడప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా మెరుస్తోంది. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ లో మెరిసిందీ రష్మీ.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.